News June 14, 2024

ఆనం మంత్రిగా పని చేసిన శాఖలు ఇవే

image

➤ 1983, 85: రోడ్లు, భవనాల శాఖ మంత్రి
➤ 2007-09: సమాచార, పౌర సరఫరాల మంత్రి
➤ 2009-12: మున్సిపల్ శాఖ మంత్రి
➤ 2012-14: ఆర్థిక శాఖ మంత్రి
➤ 2024: దేవదాయ శాఖ మంత్రి
NOTE: రాష్ట్రం విడిపోయాక తొలి మున్సిపల్ శాఖా మంత్రిగా పొంగూరు నారాయణ 2014 నుంచి 2019 వరకు పని చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడూ ఆయనకు అదే శాఖ అప్పగించారు.

Similar News

News October 17, 2025

రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

image

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.

News October 17, 2025

పంపకాల్లో తేడాలతోనే విమర్శలు: కాకాణి

image

రేషన్ అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే TDP నేతలు పరస్పం విమర్శలు చేసుకుంటున్నారని వైసీపీ నేత కాకాణి అన్నారు. నకిలీ మద్యం, రేషన్ ఇలా రోజుకొక అవినీతి కూటమి ప్రభుత్వంలో బయటపడుతుందన్నారు. దీని వెనుక TDP నేతలు ఉన్నారని Dy.CM పవన్, మంత్రి నాదెండ్ల దీనిపై విచారణ చేయాలని కాకాణి డిమాండ్ చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని ఆయన ఆరరోపించారు.

News October 17, 2025

నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

image

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.