News March 30, 2024

ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు: MLA

image

కడియం శ్రీహరి ఒక అవకాశవాదని, ఆనాడు ఎన్టీఆర్‌కు.. ఈనాడు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కడియం ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో లేడని, కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్టీకి నమ్మకద్రోహం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

Similar News

News September 17, 2025

నర్సంపేట: నేషనల్ స్పేస్ సొసైటీలో నిహారిక ఫస్ట్..!

image

నర్సంపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న భూక్య నిహారిక నేషనల్ స్పేస్ సొసైటీ (USA) నిర్వహించిన “Road Map to Space Art Contest” డ్రాయింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట MLA దొంతి మాధవ రెడ్డి భూక్య నిహారికను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News September 17, 2025

WGL: పసుపు క్వింటా రూ.10,555

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పలు రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా రూ.6,530 ధర పలకగా, పచ్చి పల్లికాయ రూ.,4500 ధర పలికింది. అలాగే మక్కలు (బిల్టీ)కి రూ.2,300 ధర వచ్చింది. మరో వైపు దీపిక మిర్చి క్వింటా రూ.14 వేలు, పసుపు రూ.10,555 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News September 17, 2025

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.