News March 19, 2025
ఆన్లైన్ బెట్టింగ్లపై పటిష్ఠ నిఘా: ASF ఎస్పీ

ఆన్లైన్ బెట్టింగ్, గేమ్లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్పై పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. మోసపూరితమైన సందేశాలను నమ్మి ఇతరులకు తమ వివరాలు ఇవ్వరాదని జిల్లా ప్రజలకు తెలిపారు. ఆన్లైన్లో డబ్బులు ఎక్కువ ఇస్తామని ఎవరైనా చెప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.
Similar News
News February 28, 2026
ఖమ్మం: గైర్హాజరు, నిర్లక్ష్యం.. 50 మంది టీచర్లకు నోటీసులు

ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.
News February 28, 2026
అనకాపల్లి: విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు నేడు లాస్ట్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలు వర్తించాలంటే విశిష్ట గుర్తింపు నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. విశిష్ట గుర్తింపు నమోదుకు శనివారం సాయంత్రం వరకు గడువు ఉందన్నారు. ఫోన్ నెంబర్, ఆధార్, పట్టాదారు పాసుబుక్కు జిరాక్స్ తీసుకుని సమీపంలో గల రైతు సేవా కేంద్రానికి వెళితే అక్కడ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తారన్నారు.
News February 28, 2026
‘6 గంటల నిద్ర’ సరిపోతుందా?

రాత్రిళ్లు తక్కువ సేపు నిద్రపోవడం ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. ‘రోజూ 6 గంటలే నిద్రపోతూ బానే ఉన్నాం అనుకోవడం భ్రమే. ఇలా 2 వారాల పాటు నిద్ర తగ్గిస్తే మెదడు రెండు రోజులు నిద్రలేని వ్యక్తిలాగే పనిచేస్తుంది. మన పనితీరు తగ్గుతున్నా మనకు తెలియదు. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతిని, నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరుగుతాయి. మెదడు ఆరోగ్యం కోసం రోజుకు 7-9 గంటల నిద్ర తప్పనిసరి’ అని సూచిస్తున్నారు. SHARE IT


