News March 4, 2025

ఆన్‌లైన్ సేవలు అందించండి: కలెక్టర్

image

కలెక్టర్ లక్ష్మీశ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణ ప్రగతిపై మంగవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మార్చి 7 నాటికి కంప్యూటరీకరణ పూర్తి కావాలన్నారు. తద్వారా జిల్లాలోని అన్ని పీఏసీలు ఈ-పీఏసీలుగా మార్పు చెందాలని తద్వారా ప్రజలకు కాగితపు రహిత ఆన్‌లైన్ సేవలు అందించాలని ఆదేశించారు.  

Similar News

News March 23, 2025

కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

image

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.

News March 23, 2025

మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

image

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు..  కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

ములుగు: డబ్బులు కాజేసిన రేంజర్.. ఎవరెవరి ఖాతాల్లో ఎంతంటే!

image

తునిగాకు బోనస్ డబ్బులను<<15852374>> ఏడుగురు అటవీశాఖ సిబ్బంది<<>> ఖాతాల్లో వేపించి రేంజర్ బాలరాజు కాజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఏటూరునాగారం రేంజర్ అప్సరున్నిసా వివరాలు.. నర్సింహులు రూ.36,912, మహబూబ్ రూ.20,563, ప్రసాద్ రూ.39,631, వైకుంఠం రూ.39,309, కృష్ణ రూ.1,32,176, భిక్షపతి 5,557, మధుకర్ 4,511 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

error: Content is protected !!