News April 10, 2025

ఆపేరల్ పార్కులో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని టెక్స్ పోర్ట్ యూనిట్‌ను రేపు మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Similar News

News November 13, 2025

ఫ్రీ బస్సు.. ఆర్టీసీకి రూ.400 కోట్ల చెల్లింపు

image

AP: స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. స్కీమ్ ప్రారంభించిన ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకు ఫ్రీ టికెట్లకు అయిన ఖర్చు రూ.400 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. దీనిపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని పేర్కొన్నాయి. కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, 10వేల మంది సిబ్బందిని నియమించాలని కోరాయి.

News November 13, 2025

మక్తల్: పడమటి ఆంజనేయ స్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

image

పడమటి ఆంజనేయస్వామి జాతర ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతర డిసెంబర్ 2న ప్రారంభం కానుందని, నవంబర్ 30న కోనేరు ప్రారంభ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, కోనేరు వద్ద స్నాన గదులు (స్త్రీ–పురుషులకు వేరు), శానిటేషన్, సీసీ కెమెరాల నిఘాతో అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

News November 13, 2025

కాణిపాకంలో జైళ్ల శాఖ డీజీపీ

image

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం జైళ్ల శాఖ డీజీపీ ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.