News April 10, 2025

ఆపేరల్ పార్కులో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సిరిసిల్ల అపెరల్ పార్క్‌లోని టెక్స్ పోర్ట్ యూనిట్‌ను రేపు మంత్రులు ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితేతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Similar News

News November 27, 2025

వరంగల్ ఎంజీఎంలో ఫిర్యాదుల పెట్టె

image

వరంగల్ ఎంజీఎంలో సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ సత్యశారద ఆసుపత్రిలో ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంజీఎంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలపై చాలా ఫిర్యాదులు చేశారు. పేషెంట్లు, వారి కుటుంబీలకు కలిగిన అసౌకర్యం, అధికారులు, సిబ్బంది అవినీతిపైన భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.

News November 27, 2025

బెంగళూరుకు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో 3 రోజుల పర్యటన ముగించుకుని గురువారం బెంగళూరుకు పయనమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందులకు చేరుకున్న ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. బుధవారం అరటి తోటలను పరిశీలించి రైతుల బాధలను తెలుసుకున్నారు. అనంతరం వైసీపీ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. సాయంత్రం ప్రజలతో మమేకమై పలు సమస్యలను తెలుసుకున్నారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి బెంగళూరుకు పయనమై వెళ్లారు.

News November 27, 2025

BREAKING: హైకోర్టు కీలక ఉత్తర్వులు

image

TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. వారి నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 1032 పోస్టులకు 2015లో నోటిఫికేషన్ వచ్చింది. అనేక న్యాయ వివాదాల అనంతరం 2019లో ఎంపిక జాబితాను TGPSC విడుదల చేసింది. అయితే మూల్యాంకనంలో పొరపాట్లు జరిగాయంటూ ఆ నియామకాలను సింగిల్ బెంచ్ రద్దు చేసింది.