News February 8, 2025
ఆమన్గల్కు 13న కేటీఆర్

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నెల 13న పదిహేను వేల మందితో రైతు దీక్ష ఉండనుంది. ఈ దీక్ష మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో జరగనుంది. ఈ కార్యక్రమనికి మాజీమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రైతు మహాదీక్షకి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు.
Similar News
News March 27, 2025
HYD: ఏటా పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్!

ఏటా రొమ్ము, గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HYDలోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 2021లో 1240 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 2024లో 1791 మంది బాధితులు దీని బారిన పడ్డారు. అదే 2021లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు 1033 నమోదు కాగా.. 2024లో వాటి సంఖ్య 1262కు చేరింది. MNJ ఆస్పత్రి విస్తరించి కొత్త భవనంలోనూ క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారు.
News March 27, 2025
మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్కు వివరించారు.
News March 27, 2025
HYDలో నేడు డబుల్ ధమాకా

HYDలో IPL సంబరాలు నేడు అంబరాన్ని అంటనున్నాయి. వినోదానికి ఉర్రూతలూగించే సంగీతం జతకానుంది. నేడు ఉప్పల్ వేదికగా రాత్రి 7:30కు SRH VS LSG మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో భాగంగా స్టేడియంలో తమన్ మ్యూజికల్ నైట్ ఈవెంట్ ఉంది. ఇంకేముంది క్రికెట్ ప్రియులు డబుల్ ధమాకా అంటున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ తగ్గేదే లే అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.