News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
తిరుపతి SVU ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News December 12, 2025
GNT: రేపు నవోదయలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష

దేశవ్యాప్తంగా నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా మద్దిరాలలో ఉన్న నవోదయ విద్యాలయ ప్రవేశానికి 5,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 12 బ్లాకులలోని 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడ్మిట్ కార్డు పొందటంలో ఇబ్బందులున్నచో నవోదయ విద్యాలయ మద్దిరాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


