News March 21, 2025
ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలి: కలెక్టర్

నర్సింగ్ విద్యార్థులకు తరగతులు నిర్వహణకు తాత్కాలికంగా ఆయుష్ భవనం వినియోగించడానికి అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో వైద్య, నర్సింగ్, ఆయుష్, సీహెచ్సీ, టీజీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు .కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయుష్ భవనంలోని రెండు అంతస్థులను నర్సింగ్ కళాశాల నిర్వహణకు కేటాయించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News December 23, 2025
జామఆకులతో మొటిమలకు చెక్

సీజనల్గా దొరికే జామకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. కానీ.. జామకాయలే కాదు వాటి ఆకులూ మనకి మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జామ ఆకులను పేస్ట్ చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. జామలోని విటమిన్-సి మొటిమలకు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
News December 23, 2025
RC పురం: ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి’

రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం పాఠశాలలో వచ్చే జనవరి 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘దక్షిణ భారత సైన్స్ ఫెయిర్’ ఏర్పాట్లను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ పరిశీలించారు. ప్రాంగణంలోని వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సైన్స్ ఫెయిర్కు వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎక్కడా లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
News December 23, 2025
ఈ అలవాట్లే క్యాన్సర్కు దారి తీస్తాయి

ఈ రోజుల్లో యువత అనుసరిస్తున్న కొన్ని అలవాట్లు భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి శరీరంలోని సర్కాడియన్ రిథమ్ను దెబ్బతీసి, DNA మరమ్మతు సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఫైబర్ తక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారం శరీరం తినడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్ D లోపం, స్మోకింగ్ చేయడం కూడా ప్రమాదకరమే.


