News February 7, 2025
ఆరు సెక్టార్లుగా బందోబస్తు: SP కృష్ణారావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738890716632_52165958-normal-WIFI.webp)
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగే ప్రాంతాన్ని ఆరు సెక్టార్లుగా విభజించామని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలుజరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు ప్రసాద్, మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 7, 2025
Stock Markets: పుంజుకొని మళ్లీ పడిపోయిన సూచీలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1731406722194_1124-normal-WIFI.webp)
నేడు బెంచ్మార్క్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,559 (-43), సెన్సెక్స్ 77,860 (-197) వద్ద ముగిశాయి. రెపోరేటు తగ్గించడంతో పుంజుకున్న సూచీలు మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్ఠానికి చేరాయి. ఆఖర్లో కాస్త పెరిగి నష్టాలను తగ్గించుకున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, FMCG, O&G షేర్లు పడిపోయాయి. మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆటో షేర్లు ఎగిశాయి. టాటాస్టీల్, ITC హోటల్స్, AIRTEL, JSW స్టీల్, TRENT టాప్ గెయినర్స్.
News February 7, 2025
కేంద్రమంత్రితో మంత్రి స్వామి భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738916575114_50216590-normal-WIFI.webp)
ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.
News February 7, 2025
జనగామ: ఉపాధి హామీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738923715717_51609077-normal-WIFI.webp)
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను నాణ్యతతో చేయించాలని, ఈనెల 15లోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని అదే విధంగా పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని ఆదేశించారు.