News June 4, 2024

ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

image

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

Similar News

News December 10, 2025

BREAKING: యర్రగుంట్లలో ఇద్దరు యువకుల మృతి

image

యర్రగుంట్లలోని ముద్దునూరు రోడ్డులో ఉన్న జడ్పీ బాయ్స్ హైస్కూల్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముద్దనూరు వైపు వెళ్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే చనిపోయారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

News December 10, 2025

క‌డ‌ప మాజీ మేయ‌ర్ సురేశ్‌కు హైకోర్టు షాక్‌.!

image

క‌డ‌ప మాజీ మేయ‌ర్ సురేశ్‌కు హైకోర్టు బుధవారం షాక్ ఇచ్చింది. ఆయ‌న‌ పిటిష‌న్‌ను డిస్మిస్ చేస్తూ న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రేపు కడప కొత్త మేయర్‌ ఎన్నిక యథావిధిగా జరగనుంది. గ‌తకొన్ని రోజులక్రితం క‌డ‌ప మేయ‌ర్ పీఠంపై నుంచి సురేశ్ బాబును కూట‌మి ప్ర‌భుత్వం తప్పించగా ఈసీ నోటిఫికేషన్‌పై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.

News December 10, 2025

తొలగిన అడ్డంకులు.. రేపు యథావిధిగా కడప మేయర్‌ ఎన్నిక

image

కడప నగర నూతన మేయర్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. రేపు ఉదయం జరగాల్సిన ప్రత్యేక సమావేశంలో నూతన మేయర్ ఎన్నికను జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక చెల్లదంటూ YCP నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు సమగ్రంగా విచారణ జరిపి యథావిధిగా రేపు జరగవలసిన మేయర్ ఎన్నిక ప్రక్రియను కొనసాగించాలంటూ కాసేపటి క్రితం తీర్పు ఇచ్చింది. దీంతో రేపు నూతన మేయర్‌ను ఎన్నుకోనున్నారు.