News June 4, 2024
ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
Similar News
News November 20, 2025
నేడు ఎర్రగుంట్ల RTPPకి అసెంబ్లీ కమిటీ.!

నేడు ఎర్రగుంట్ల రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (RTPP)ను రాష్ట్ర అసెంబ్లీ కమిటీ సభ్యులు సందర్శిస్తున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ ఆధ్వర్యంలో 12 మంది కమిటీ సభ్యులు అక్కడికి వెళ్లనున్నారు. RTPPలో విద్యుత్ ఉత్పత్తి, ప్లాంట్ పనితీరు, బొగ్గు కొరత తదితర అంశాలపై కమిటీ పరిశీలించనుంది. కాగా RTPP అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News November 20, 2025
కడప: దీనీ ఇస్తిమాకు CMకి ఆహ్వానం

కడప నగరంలో 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కడప ముస్లిం పెద్దలు కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం సంబంధిత అధికారులకు, శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా సూచించారన్నారు. అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.
News November 20, 2025
కడప జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

కడప జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.


