News June 13, 2024
ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ ఫలితాల విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. విద్యార్థులు వెబ్సైట్ నుంచి ఫలితాలను పొందవచ్చునని సూచించారు.
Similar News
News March 27, 2025
విశాఖ: ప్రేమ పేరుతో గాలం.. గర్భం దాల్చిన బాలిక..!

విశాఖలో 9వ తరగతి చదువుతున్న బాలికను సీతయ్య అనే వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటనపై MVP పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహితుడైన సీతయ్య.. తల్లి,అన్నయ్యతో కలిసి ఉంటున్న బాలిక(14)కు ప్రేమ పేరుతో గాలం వేశాడు. ఆమెపై పలుమార్లు లెంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా గర్భవతని తేలింది. దీంతో సీతయ్యపై ఫిర్యాదు చేశారు.
News March 27, 2025
ప్రారంభానికి సిద్ధంగా “VMRDA THE DECK”

సిరిపురం నిర్మాణంలో ఉన్న నూతన “VMRDA THE DECK” త్వరలో ఓపెన్ కాబోతుంది. ఇందులో 5 అంతస్తుల్లో పార్కింగ్ సదుపాయం, 6 అంతస్తుల్లో కమర్షియల్కి సదుపాయం కల్పించబోతున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.87.50 కోట్లు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నారు. అతి త్వరలో దీనిని ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రారంభమయ్యాక పార్కింగ్ సమస్యలు తీరనున్నాయి. ఇందులో 4వీలర్, 2వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు.
News March 27, 2025
విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

విశాఖలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితుడుని గుర్తించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హోం మంత్రికి సీపీ తెలిపారు.