News September 5, 2024

ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు: త్రిపుర గవర్నర్

image

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో గురువారం అభినవ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్న విధానాన్ని త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి డ్రోన్ పథకం ద్వారా సులభతరమైన పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చన్నారు. ప్రస్తుత కాలంలో ప్రకృతి వ్యవసాయం చాలా అవసరమని, ఆర్గానిక్ పంటల సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని అన్నారు.

Similar News

News November 5, 2025

ఎస్సీ విద్యార్థులకు గుడ్‌న్యూస్: రూ.3,500 స్కాలర్‌షిప్

image

జిల్లాలోని 9వ, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున వారికి రూ.3,500 స్కాలర్‌షిప్‌ను మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ అధికారి భాగ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తమ విద్యార్థుల వివరాలను https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆమె ఆదేశించారు.

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.