News April 25, 2024

ఆర్చరీలో మెరిసిన వెన్నం జ్యోతి సురేఖ

image

విజయవాడకు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో సత్తా చాటింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న పోటీలో మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ రెండో స్థానంలో నిలిచింది. సురేఖ, అదితి, పర్‌ణీత్‌లతో కూడిన భారత జట్టు(2118) టీమ్ విభాగం క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానం కైవసం చేసుకుంది. మరోవైపు, మిక్స్‌డ్ టీమ్‌లో సురేఖ- అభిషేక్ (1419) జోడీ రెండో స్థానంలో నిలిచింది.

Similar News

News October 16, 2025

కృష్ణా: బెల్ట్ షాపుల్లో మద్యం సురక్షితమేనా.?

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్‌ ద్వారా వైన్ షాపులు, బార్‌లలో మద్యం సీసాల స్కానింగ్‌ సదుపాయం అందుబాటులో ఉంది. అయితే, బెల్ట్ షాపుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని మద్యం ప్రియులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం మద్యం విక్రయిస్తున్న ఈ బెల్ట్ షాపుల్లో అమ్ముతున్న సీసాలు అసలువో, నకిలీవో తెలుసుకునే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 16, 2025

అంగలూరులో రాష్ట్రంలో మొట్టమొదటి బాలికల పాఠశాల

image

గుడ్లవల్లేరు అంగలూరు గ్రామంలో చల్లపల్లి జమిందార్ జ్ఞాపకార్థంగా బాలికల పాఠశాల ప్రారంభించారు. స్వాతంత్య్రం రాక ముందు బాలికలకు విద్య దూరంగా ఉండేది. దీంతో 1946లో ఈ స్కూల్ ప్రారంభించి బాలికా విద్యకు పునాది వేశారు. జమిందారీ దాతృత్వంతో 96 సంవత్సరాల అద్భుత ప్రయణం సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన బాలికల ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. ఇటీవల జిల్లాస్థాయి స్వచ్ఛ పాఠశాల అవార్డు అందుకుంది.

News October 16, 2025

గన్నవరంలో యాక్సిడెంట్.. స్పాట్ డెడ్

image

గన్నవరం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ – ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో బైకుపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బాపులపాడు మండలానికి చెందిన గరికిపాటి సుబ్బారావుగా గుర్తించారు. అతను రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. మార్కెట్ నుంచి సరుకులకు తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.