News March 5, 2025

ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్

image

బాసర ఆర్జీయూకేటీలో ఈసీఈ శాఖలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్ పద్మశ్రీకి డాక్టరేట్ అవార్డును ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యాపకురాలు డాక్టర్.పద్మశ్రీని అభినందించారు. ఆర్జీయూకేటీలో చాలామందికి డాక్టరేట్ రావడం ఆనందంగా ఉందని గోవర్ధన్ పేర్కొన్నారు.

Similar News

News April 11, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికం ఇక్కడే

image

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. గతంతో పోలిస్తే సమాన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ ప్రజలు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. అధికారులు వెల్లడించిన వివరాలు.. మెండోరా, భీమ్గల్ 41.6°C, వేంపల్లి బాల్కొండలో 41.5,°C లు నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలోని సగం ప్రాంతాల్లో 40°C లకు పైగా రికార్డ్ అయ్యాయి. అటు కామారెడ్డి జిల్లాలో సైతం సోమూర్ 40.3°C, భిక్కనూరు 40.2°C లు నమోదయ్యాయి.

News April 11, 2026

GDK: రేపే ‘పుణ్యక్షేత్రాల’ యాత్ర.. ఆర్టీసీ ప్రత్యేక బస్సు

image

గోదావరిఖని డిపో ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఏసీ రాజధాని బస్సులో దక్షిణ భారత పుణ్యక్షేత్రాల యాత్ర ప్రారంభం కానుంది. కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం, పలని, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, కంచి, జోగులాంబ తదితర క్షేత్రాలను సందర్శించవచ్చు. ఒక్కొక్కరికి రూ. 10,500 చార్జీగా నిర్ణయించారు. భోజనం, వసతి ఖర్చులు భక్తలవే. ఆసక్తి గల భక్తులు మరిన్ని వివరాలకు 7013504982, 7382847596 నంబర్లకు సంప్రదించవచ్చు.

News April 11, 2026

ఆదోని వద్ద ఘోర ప్రమాదం.. యువతి మృతి

image

ఆదోని–సిరుగుప్ప రహదారిలోని లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అతివేగంతో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువతి మరణించగా, మరో ఇద్దరు యువతులు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్వీ పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.