News February 22, 2025

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపిక

image

కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికైంది. మొత్తం 6 పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వాటిలో మెదక్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం, రాయడం సంబంధించి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ పొందుపరుస్తారు.

Similar News

News February 23, 2025

మెదక్: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

News February 23, 2025

సిద్దిపేట: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు

image

సిద్దిపేట జిల్లా కొండపాకలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై కేసు నమోదైంది. వివరాలు.. ఖమ్మంపల్లి పాఠశాల సైన్స్ టీచర్ దేవయ్య ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దేవయ్య వేధింపులు భరించలేక విద్యార్థినులు హెచ్‌ఎంకు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవయ్యపై కేసు నమోదు చేశారు. దేవయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.

News February 23, 2025

మెదక్: నేడే గురుకుల పరీక్ష

image

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

error: Content is protected !!