News March 21, 2025
ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

జవహర్నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.
Similar News
News November 29, 2025
ఈ ఫైనాన్స్ జాబ్స్తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో అత్యధికంగా M&A అనలిస్ట్కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.
News November 29, 2025
కందుకూరు, అద్దంకి డివిజన్లో కలిసే మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని కొన్ని డివిజన్లలో మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా కందుకూరు డివిజన్లోకి లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం వచ్చి కలవనున్నాయి. కనిగిరి డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు డివిజన్లో కలవనున్నాయి. అద్దంకి పరిధిలోకి బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు- ఒంగోలు నుంచి ముండ్లమూరు, తాళ్ళూరు, కనిగిరి నుంచి దర్శి, దొనకొండ, కురిచేడు రానున్నాయి.
News November 29, 2025
TU: మాస్ కాపీయింగ్.. ఇద్దరు డిబార్

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని అడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 2,199 మంది విద్యార్థులకు 2,037 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 3వ సెమిస్టర్ రెగ్యులర్, 4వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 4,775 మందికి 4,544 మంది హాజరయ్యారు. మొత్తంగా 391 మంది గైర్హాజరై ఇద్దరు డిబార్ అయినట్లు వెల్లడించారు.


