News March 21, 2025
ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ స్నాతకోత్సవ వేడుకల్లో గవర్నర్

జవహర్నగర్ పరిధిలోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ (ACDS) బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ విద్యార్థుల కోసం 19వ స్నాతకోత్సవ వేడుకను నిర్వహించింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు. ప్రిన్సిపల్ డా.మమతా కౌశిక్ కళాశాల నివేదికను సమర్పించారు. ACDS ఛైర్మన్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గ్రాడ్యుయేట్లు ఆదర్శవంతంగా పనిచేయాలన్నారు.
Similar News
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.
News April 19, 2025
గద్వాల్: భూభారతితో రైతులకు భద్రత: పొంగులేటి

భూభారతి 2025 చట్టం రైతులకు మరింత భద్రత కల్పిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ జిల్లా ధరూర్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై, మాట్లాడారు. గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతు సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.