News February 22, 2025
ఆర్మీ జవాన్పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: SI

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామంలో ఆర్మీ జవాన్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిరణ్ శుక్రవారం తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి, భూమేష్ గురువారం రాత్రి గొల్లమాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భోజరాజుపై దాడి చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 20, 2025
ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
News November 20, 2025
కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.
News November 20, 2025
KMR: NPYAD పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ దరఖాస్తులకు ఆహ్వానం

2025-26 సం.రానికి గాను జాతీయ యువత, కౌమార దశ అభివృద్ధి కార్యక్రమం NPYAD పథకం కింద ఆర్థిక సహాయమందించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 30 లోపు ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముందుగా http://NGO darpan.gov.inలో నమోదు చేసుకొని యూనిక్ దర్పన్ ఐడి పొందాలన్నారు. వివరాలకు కలెక్టరేట్లో సంప్రదించాలన్నారు.


