News February 22, 2025
ఆర్మీ జవాన్పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: SI

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామంలో ఆర్మీ జవాన్పై దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయి కిరణ్ శుక్రవారం తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పోశెట్టి, భూమేష్ గురువారం రాత్రి గొల్లమాడ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భోజరాజుపై దాడి చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News November 23, 2025
నాగర్ కర్నూల్ జిల్లా TODAY.. టాప్ NEWS

*NGKL నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
*పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు
*వెల్దండ: పాఠశాలలో మొక్కలు నాటిన డీఈవో
*NGKL: నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ధర్నా- సీఐటీయూ
*బల్మూర్: ఇందిర మహిళా శక్తి చీరలు పంపిణీ- ఎమ్మెల్యే
*పెద్దకొత్తపల్లి: ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ
*చారకొండ: విజయవంతమైన ఉచిత డయాబెటిస్ వైద్య శిబిరం
*బిజినేపల్లి: నాటు వైద్యం వికటించి మహిళా మృతి
News November 23, 2025
GDK: స్టడీ సెంటర్లో డిగ్రీ విద్యార్థులకు తరగతులు ప్రారంభం

డా॥BR.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గోదావరిఖని స్టడీ సెంటర్లో డిగ్రీ విద్యార్థులకు కౌన్సెలింగ్ తరగతులు ప్రారంభమైనట్లు కో-ఆర్డినేటర్ డా॥ జీ.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ జైకిషన్ ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. 1st Year విద్యార్థులకు 1st SEM, 2nd Year విద్యార్థులకు 3rd SEM, 3rd Year విద్యార్థులకు 6th SEM ప్రతి ఆదివారం 9AM నుంచి 5PM వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు హాజరుకావాలన్నారు
News November 23, 2025
DEC నెలాఖరుకు రాష్ట్రంలో గుంతల్లేని రోడ్లు: చంద్రబాబు

AP: డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు దర్శనమివ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. R&B రహదారుల అభివృద్ధిపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి, మరమ్మతులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్లను ఆదేశించారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 5,471KM రోడ్ల అభివృద్ధికి అనుమతులిచ్చామన్నారు.


