News April 11, 2025
ఆర్మీ మేజర్గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.
Similar News
News January 7, 2026
అడ్డతీగల: ‘టీచర్స్ వివరాలు అప్ లోడ్ చేయండి’

పోలవరం జిల్లాలో ప్రభుత్వం విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్స్ అందరూ తమ వ్యక్తి గత వివరాలను లీప్ యాప్ లో నమోదు చేయాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు బుధవారం మీడియాకు తెలిపారు. విద్య శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ నెల 9లోగా అప్ లోడ్ చేయాలని, మార్పులు, చేర్పులు ఉంటే రెండు రోజుల్లో సరిచేసుకోవాలన్నారు. ఇక గడువు పొడుగుంచబడని, అందరు టీచర్స్ ఆదేశాలు పాటించాలన్నారు.
News January 7, 2026
ఉగ్ర దోస్తీ.. పాక్లో చేతులు కలిపిన హమాస్, లష్కరే!

పాక్ అడ్డాగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ ముమ్మరమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కీలక నేత రషీద్ అలీ సంధూతో గుజ్రాన్వాలాలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. గతంలోనూ జహీర్ PoKలో పర్యటించి భారత వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నాడు. అమెరికా నిషేధించిన ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పాక్ సైన్యం అండ ఉన్నట్లు సమాచారం.
News January 7, 2026
VJA: లోకల్కే పెద్దపీట.. సంక్రాంతికి 6వేల RTC సర్వీసులు.!

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని RTC కీలక నిర్ణయం తీసుకుంది. 8,432 ప్రత్యేక సర్వీసుల్లో 6వేల బస్సులను రాష్ట్రంలోని లోకల్ రూట్లలోనే నడపనుంది. ‘స్త్రీశక్తి’ పథకంతో పెరిగిన రద్దీ దృష్ట్యా స్థానిక ప్రాంతాలకు పెద్దపీట వేసింది. HYD, బెంగళూరు, చెన్నైల నుంచి వందలాది బస్సులు నడుపుతున్నా, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసుల ద్వారా గ్రామీణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రణాళిక సిద్ధం చేశారు.


