News April 11, 2025

ఆర్మీ మేజర్‌గా మంచిర్యాల బిడ్డ మీనాక్షి గ్రేస్

image

మేజర్ పదోన్నతి పొందిన మీనాక్షి గ్రేస్‌ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మీనాక్షి గ్రేస్ భారత సైన్యంలో కెప్టెన్ నుంచి మేజర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా ఎమ్మెల్యే ఆమె స్వగృహానికి వచ్చారు. నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. దేశ సేవకు చేసిన కృషి ప్రతి యువతకి ఆదర్శంగా నిలవాలన్నారు.

Similar News

News April 18, 2025

సిరిసిల్ల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.లక్ష పంపిణీ 

image

సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష నిధులు విడుదల చేసిందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ప్రతి మండలంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిందన్నారు. ప్రాజెక్టు కింద పైలెట్ ప్రాజెక్టుకింద మొత్తం1023 ఇళ్లు మంజూరు చేశామన్నారు. 

News April 18, 2025

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం

image

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా వేంపల్లి చెందిన సుబ్రహ్మణ్యంను పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు నియామక ధ్రువపత్రాన్ని ఆయనకు మాజీ ఎంపీ తులసి రెడ్డి, పులివెందుల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు సూచించారు.

News April 18, 2025

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) కీలక నిర్ణయం

image

రిక్రూట్‌మెంట్‌లో భద్రత, పారదర్శకత పెంపొందించేందుకు SSC కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మే నుంచి నిర్వహించబోయే పరీక్షలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పరీక్షా కేంద్రాల వద్ద ఈ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది. అయితే, అభ్యర్థి తమ వెరిఫికేషన్‌ను స్వచ్ఛందంగానే చేసుకోవాలని పేర్కొంది.

error: Content is protected !!