News July 14, 2024
ఆర్మూర్: ఆస్తి వివాదంలో అన్న ప్రాణం తీసిన తమ్ముడు

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News July 8, 2025
NZB ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా కృష్ణ మోహన్

నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా డాక్టర్ కృష్ణ మోహన్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.
News July 8, 2025
NZB: ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి కల్పిస్తూ CP సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ASI నాగభూషణం, మాక్లూర్ PSలో పని చేస్తున్న నర్సయ్య, NZB త్రీ టౌన్లో పని చేస్తున్న లీలా కృష్ణకు SIలుగా పదోన్నతులు కల్పించారు. నాగభూషణం, నర్సయ్యలను నిర్మల్ జిల్లాకు, లీలా కృష్ణను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.
News July 8, 2025
భీమ్గల్: 5 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..?

భీమ్గల్ మండలంలో దారుణం జరిగింది. కడుపులో దాచుకోవాల్సిన తల్లి బిడ్డను కడతేర్చింది. తన కూతురిని భార్యే హత్య చేసిందని భర్త ఫిర్యాదు చేసినట్లు SI సందీప్ తెలిపారు. గోనుగొప్పుల వాసి మల్లేశ్- రమ్య దంపతులకు శివాని(5) సంతానం. రమ్య తాగుడుకు బానిసై చిన్నారిని పట్టించుకోవడం లేదు. దీంతో మల్లేశ్ భార్యను పలు మార్లు మందలించాడు. బిడ్డ కారణంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య ఈనెల 6న హత్య చేసిందన్నారు.