News February 1, 2025

ఆర్మూర్: కేంద్ర మంత్రిని కలిసిన పల్లె గంగారెడ్డి

image

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నేషనల్ టర్మరిక్ బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు ఛైర్మన్ పదవి చేపట్టడానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. పసుపు రైతుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు.

Similar News

News November 26, 2025

నిజామాబాద్‌లో ఈ గ్రామాలు మహిళలవే..!

image

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

News November 26, 2025

నిజామాబాద్‌లో ఈ గ్రామాలు మహిళలవే..!

image

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

News November 26, 2025

నిజామాబాద్: ‘లోకల్ దంగల్’.. తగ్గేదే లే!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో NZB జిల్లాలోని 545 గ్రామాల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో తగ్గేదేలే అన్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ ఉండబోతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో BJP, CPM, CPIతో పాటు ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ల ప్రభావం కూడా ఉండబోతోందని అంటున్నారు.