News February 10, 2025

ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.

Similar News

News January 6, 2026

జక్రాన్‌పల్లి: ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య

image

అనారోగ్య సమస్యలతో ఇంట్లో ఉరేసుకొని ఓ వృద్ధురాలు బలవన్మరణం చెందినట్లు జక్రాన్ పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. మునిపల్లికి చెందిన ఆరే గంగు(85) గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో కాలుజారి కింద పడగా తుంటి ఎముక పెరిగింది. దీంతో మనస్థాపానికి గురైన వృద్ధురాలు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

News January 6, 2026

NZB: పాముకాటుతో వ్యక్తి మృతి.. కేసు నమోదు

image

మోపాల్ మండలం శివలాల్ తండాలో పాముకాటుతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై సుశ్మిత తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన కేతావత్ రామచందర్(43)కు పొలంలో పనిచేస్తుండగా పాము కరిచింది. దీంతో అతన్ని NZBలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స సమయంలో కోమాలోకి వెళ్లడు. అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో మృతి చెందాడు.

News January 5, 2026

నిజామాబాద్: సంక్రాంతి ప్రయాణమా.. జాగ్రత్తలు తప్పనిసరి!

image

సంక్రాంతి సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నగలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, ఇంటికి బలమైన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వాడాలని చెప్పారు. ​ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దన్నారు. సీసీ కెమెరాల ద్వారా ఇంటిని పర్యవేక్షించాలన్నారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే ‘డయల్ 100’కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.