News February 3, 2025
ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం: గొట్టిపాటి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ని ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 26, 2025
ఆచంట: ఆస్తుల పంపకాల్లో గొడవ.. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. ఆచంట పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిన్న సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
శ్రీ చైతన్యలో స్కాలర్షిప్ టెస్ట్.. లాప్టాప్ బహుమతి

పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కార్పొరేట్ విద్య అందించేందుకు శ్రీ చైతన్య ఐఐటీ-జేఈఈ & నీట్ అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ను నవంబర్ 2న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతిగా లాప్టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి ట్యాబ్లు ఇస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 98485 87584 నంబర్ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్ రవికిరణ్ తెలిపారు.
News October 26, 2025
జూబ్లీహిల్స్లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్’ అంతగా ఉండకపోవచ్చు.


