News February 3, 2025
ఆలపాటిని ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం: గొట్టిపాటి

రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ని ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు, శాసనసభ్యులు పాల్గొన్నారు.
Similar News
News February 11, 2025
సీఎం చంద్రబాబు ఆగ్రహం

AP: సచివాలయంలో నిర్వహించిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశానికి ఆయన వచ్చిన 10 నిమిషాల తర్వాత మంత్రులు, అధికారులు తాపీగా రావడంతో సీబీఎన్ వారందరికీ క్లాస్ తీసుకున్నారు. సమయపాలన లేకపోవడమేంటని ప్రశ్నించారు. ఇక నుంచి ఇలాంటివి సహించేది లేదని తేల్చిచెప్పారు.
News February 11, 2025
ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం..

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,63,681 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు ద్వారా.. టికెట్ల విక్రయాలు- రూ.1,10,614, ప్రసాదాల అమ్మకాలు- రూ.35,445, అన్నదానం ద్వారా రూ.17,622లు వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఓ ప్రకటన ద్వారా భక్తులకు తెలియజేశారు.
News February 11, 2025
పార్వతీపురం: టెన్త్ అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు

పార్వతీపురం పోస్టల్ డివిజన్లోని వివిధ పోస్ట్ ఆఫీసుల పరిధిలో 39 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారని పోస్టల్ సూపరింటెండెంట్ బాబూరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. మార్చి 3 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు.