News October 6, 2024

ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News December 11, 2025

తూ.గో. కలెక్టర్‌కు 13వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి IAS 711 ఫైళ్లు స్వీకరించి, 680 ఫైళ్లను పరిష్కరించారు. ఆమె సగటు ప్రతిస్పందన సమయం 1 రోజు 21 గంటల 12 నిమిషాలుగా ఉంది. ఈమె పనితీరు ఆధారంగా ఆమెకు 13వ ర్యాంకు కేటాయించారు.

News December 10, 2025

ధాన్యం కొనుగోలులో పారదర్శకత అవసరం: జేసీ

image

ధాన్యం కొనుగోలులో గోనె సంచులు, రవాణా, కొలతలు, చెల్లింపులు వంటి అన్ని అంశాల్లో పారదర్శకత ఉండాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఫిర్యాదులు అందిన నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని.. ప్రతి సమాచారం రైతులకు, మీడియాకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News December 10, 2025

రాజమండ్రి: విద్యాభివృద్ధిలో తరగతి పరిశీలన కీలకం- DEO

image

పాఠశాల విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో దోహదపడే తరగతి పరిశీలన చిత్తశుద్ధితో నిర్వహించాలని DEO కె.వాసుదేవరావు సూచించారు. గత 2రోజులుగా స్థానిక దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న సీఆర్‌ఎంటీలు, ఉపాధ్యాయుల “టీచ్ టూల్ అబ్జర్వేషన్ శిక్షణ” తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.