News March 29, 2025
ఆలమూరు: నూకాంబికమ్మను దర్శించిన ప్రముఖ హాస్య నటుడు

ఆలమూరు మండలం చింతలూరు నూకాంబికా అమ్మవారిని ప్రముఖ సినీ నటుడు, రచయిత, కళాకారుడు పోలాప్రగడ జనార్ధన్ రావు (జెన్నీ) శనివారం దర్శించుకున్నారు. అమలాపురంలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్కు వచ్చిన ఆయన తన అమ్మమ్మ ఊరు అయిన చింతలూరు వచ్చి ఉత్తర ముఖ వేంకటేశ్వరస్వామివారిని, నూకాలమ్మ అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. భక్తుల సహకారంతో అమ్మవారి ఆలయం దినదినాభివృద్ధి చెందడం శుభపరిణామం అని అన్నారు.
Similar News
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.
News November 20, 2025
iBOMMA Oneపై పోలీసుల రియాక్షన్

iBOMMA One పైరసీ వెబ్సైట్పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ సైట్లో కొత్త సినిమాలు పైరసీ సినిమాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే ఉన్నాయని, తెరవడానికి ప్రయత్నిస్తే కూడా సైట్ ఓపెన్ కాకపోగా, ఏ ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే iBOMMA, BAPPAM వంటి వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.
News November 20, 2025
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.


