News February 13, 2025
ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించండి: డీకే అరుణ

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఎంపీ డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ ఆలయంతో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి “ప్రసాద్ పథకం” కింద నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.
Similar News
News February 24, 2026
భాగ్యనగరంలో భారీ వర్షం.. రాబోయే కొన్ని గంటలు అలర్ట్!

HYDలో అల్వాల్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, బషీర్బాగ్ సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో GHMC వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా నగరంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండొచ్చని మ్యాప్ విడుదల చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి చీకట్లు అలముకొన్నాయి.
News February 24, 2026
మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే..

శివునికి అంకితం చేసిన ఈ మంత్రం అతి శక్తిమంతమైనది. దీనిని ‘మృత్యువును జయించే మంత్రం’ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. అకాల మృత్యు భయం పోవడానికి, త్వరగా కోలుకోవడానికి, శివుని రక్షణ పొందడానికి దీనిని పఠిస్తుంటారు.
మంత్రం: ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్| ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్||
News February 24, 2026
30 లక్షల ఇళ్లపై సోలార్ వెలుగులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అద్భుతమైన స్పందన వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30 లక్షల గృహాల్లో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఈ ఘనతపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత్ ఇంధన భద్రత, స్వయం సమృద్ధి దిశగా వేసిన కీలక అడుగు అని కొనియాడారు.


