News May 18, 2024

ఆలూరు ఏడీఈపై సస్పెన్షన్ వేటు

image

ఆలూరు విద్యుత్ శాఖ ఏడీఈ నాగేంద్ర ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల ముందు రోజు హాలహర్వి మండలంలో పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది. హొలగుంద మండలంలో ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాల అనధికారిక ఏర్పాట్లు, మే 13న పలు పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకు విద్యుత్ అసౌకర్యం నెలకొనడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అవినీతికి పాల్పడడంతో ఉన్నతాధికారులు ఆయనపై వేటు వేశారు.

Similar News

News October 2, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు

image

బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News October 1, 2024

సీఎం స‌మ‌క్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు జిల్లాలో త్వ‌ర‌లోనే ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్ నెల‌కొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చ‌కాయ‌ల‌మ‌డలో సీఎంతో క‌లిసి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట‌మోటా పంట‌ను ఎక్కువ‌గా సాగు చేస్తార‌న్నారు. యూనిట్ నెల‌కొల్పేందుకు ఉన్న వివాదాల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌మ‌క్షంలో చెప్పారు.

News October 1, 2024

జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

image

పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.