News October 17, 2024
ఆలూరు: చేనుకు గడ్డి మందు కొట్టిన దుండగులు
ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామానికి చెందిన ఈరమ్మ 9 ఎకరాల్లో రూ.1.50 లక్షల ఖర్చుతో జొన్న పంట సాగుచేసింది. బుధవారం చేనుకు వెళ్లి చూడగా పంటకు ఎవరో గడ్డిమందు కొట్టారని బాధిత మహిళ వాపోయింది. అయితే ఆస్తి పంపకాలు చేయలేదని తన కుమారులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News October 17, 2024
ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాలు కల్పిస్తాం: నంద్యాల కలెక్టర్
సమాజంలో పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్ జెండర్లకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని నంద్యాల కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ట్రాన్స్ జెండర్ల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ట్రాన్స్ జెండర్లు మెరుగైన జీవితాన్ని అవలంబించేందుకు పురుషులు, స్త్రీలతో సమాన అవకాశాలు కల్పిస్తూ ఉపాధి మార్గాలు చూపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
News October 16, 2024
రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురండి: కలెక్టర్
స్వర్ణాంధ్ర@2047లో భాగంగా నంద్యాల జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న నిర్దిష్ఠ లక్ష్యంతో అధికారులు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో స్థూల దేశీయోత్పత్తి, ఆదాయ వృద్ధిరేట్లపై జిల్లా అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
News October 16, 2024
నంద్యాల జిల్లాలో నేడు సెలవు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.