News March 29, 2024

ఆలూరు టికెట్ కేటాయించిన చంద్రబాబు.. వీడిన ఉత్కంఠ

image

ఆలూరు TDP MLA టికెట్ వీరభద్ర గౌడ్‌కు టీడీపీ అధిష్ఠానం కేటాయించింది. దీంతో ఆలూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అటు ఇటీవలే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కాగా.. ఆదోనికి కూటమిలో భాగంగా BJP అభ్యర్థి పార్థసారథిని ప్రకటించారు.

Similar News

News February 15, 2026

ఛాంపియన్‌గా కర్నూలు జిల్లా జట్టు

image

రెండు రోజులుగా కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న 3వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కర్నూలు జట్టు మొదటి స్థానం, కృష్ణాజిల్లా జట్టు రెండవ స్థానం, గుంటూరు జట్టు మూడో స్థానంలో నిలిచింది.

News February 15, 2026

ప్రేమ విఫలం.. ఆళ్లగడ్డలో యువకుడి సూసైడ్?

image

ఆళ్లగడ్డలోని పుల్లారెడ్డి వీధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ జీవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన సత్యనారాయను సయామి(25) ఇంట్లో ఉరివేసుకొని అనుమానాదాస్పద స్థితిలో మృతిచెందాడు. విషయాన్ని ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలమై ఉరివేసుకొన్నట్లు భావిస్తున్నారు.

News February 15, 2026

రేపు కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.