News March 27, 2025

ఆలూరు సాంబ శివారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు

image

శింగనమల నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఆలూరు సాంబ శివారెడ్డికి వైసీపీ కీలక పదవి కట్టబెట్టింది. ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్‌గా నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవి ఇచ్చిన అధినేతకు సాంబ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తన మీద జగన్ ఉంచిన నమ్మకంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.

Similar News

News April 20, 2025

ATP: చెత్త సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

image

అనంతపురం జిల్లా రూరల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సమీపంలోని జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్, చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించారు.

News April 19, 2025

ATP:వసతి గృహాల విద్యార్థుల ప్రతిభ గర్వకారణం: కలెక్టర్

image

ఇంటర్‌లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి 900కు పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. శనివారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యార్థులతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు.

News April 19, 2025

ప్రభుత్వ భవనాల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

గిరిజన కుటుంబాలకు రూఫ్ టాప్ కింద సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. వారికి ఆయుష్మాన్ భారత్ కార్డులు పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద అర్హతలతో గుర్తించబడిన వారికి గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల భవనాలకు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలన్నారు.

error: Content is protected !!