News October 29, 2024

ఆలేరు: బ్రెయిన్ డెడ్‌తో మృతి.. మరికొందరికి పునర్జన్మ

image

తాను చనిపోతూ పది మందికి అవయవ దానం చేసి మానవత్వన్ని చాటుకున్న ఘటన ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. ఆలేరు మండల కేంద్రానికి చెందిన జూకంటి కుమార్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొదుతూ మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ సంస్థ ద్వారా అవయవాలను దానం చేశారు.

Similar News

News November 26, 2025

NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

image

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.

News November 26, 2025

మునుగోడు: పత్తి మిల్లులో అనుమానాస్పదంగా కార్మికుడు మృతి

image

మునుగోడు మండలం కొంపల్లిలోని జై బిందు పత్తి కొనుగోలు కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన కార్మికుడు ముస్తఫా జాఫర్ సాఫ్ జలాలు (30) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. తహశీల్దార్ నరేష్, చండూరు సీఐ ఆదిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానం ఉన్న శార్దూల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.

News November 26, 2025

నల్గొండ: చనిపోతూ ముగ్గురికి లైఫ్ ఇచ్చారు

image

చండూరుకు చెందిన రైతు పాలకూరి రామస్వామి (75) బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో మూడు నిండు జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవయవదానం చేశారు. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆ కుటుంబ సభ్యులకు వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అవయవదానం-మహాదానం అని ఆయన పేర్కొన్నారు.