News February 13, 2026
ఆలేరు మున్సిపల్ పీఠం ‘హస్త’గతం

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు, బిజెపి 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఛైర్మన్ రేసులో ఏడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి భాస్కర్ ఉన్నట్లు సమాచారం.
Similar News
News March 9, 2026
పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2026
HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


