News March 6, 2025
ఆళ్లగడ్డలో ఉచితంగా ‘ఛావా’ చిత్రం ప్రదర్శన

ఛత్రపతి శివాజీ కొడుకు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా‘ చిత్రం ఆళ్లగడ్డలోని రామలక్ష్మి థియేటర్లో నేడు ఉచితంగా ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం నుంచి 3 షోలు ప్రదర్శిస్తున్నామని థియేటర్ ప్రొప్రైటర్ అట్లా దిలీప్ కుమార్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్క హిందూ సోదరులు సినిమాను చూడాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 18, 2025
చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.
News November 18, 2025
చావడానికి సిద్ధంగా ఉన్నా: యువరాజ్ తండ్రి

తన జీవితం ముగిసిపోయిందని, చావడానికి సిద్ధంగా ఉన్నానని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ అన్నారు. తన స్వగ్రామంలో ఒంటరిగా గడుపుతున్నానని, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఎవరినీ సాయం అడగనని చెప్పారు. తాను కొన్ని తప్పులు చేసి ఉండొచ్చని, కానీ ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వృద్ధాప్యంలో ఎవరూ తోడుగా లేరని వాపోయారు.
News November 18, 2025
ఖమ్మం: సీతారామ పథకానికి అత్యధిక పరిహారం: అ. కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణపై సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి రైతులతో చర్చించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బాజుమల్లాయిగూడెం రైతులకు ఎకరాకు ₹11.44 లక్షలు, రేలకాయపల్లికి ₹12.40 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. భూముల ధరలు వార్షికంగా పెరిగే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, బాజుమల్లాయిగూడెం రైతులకు ₹15 లక్షలు, రేలకాయపల్లి రైతులకు ₹16 లక్షల పరిహారం అందిస్తామని ఆయన తెలిపారు.


