News April 5, 2024
ఆళ్లగడ్డ: 5సార్లు ఎన్నికలబరిలో నిలిచి.. గెలిచి

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా శోభానాగిరెడ్డిది ప్రత్యేక స్థానంగా చెప్పవచ్చు. 5 సార్లు ఎన్నికల బరిలో నిలిచి గెలిపొందారు. 2009 నుంచి 2014 వరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే 1997లో టీడీపీ ఎమ్మెల్యేగా 46959 అత్యధిక ఓట్ల మెజార్టీ, 2012లో 36795 రెండవ అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డు ఉంది. ఈ ఎన్నికలలో ఆళ్లగడ్డలో ఈ మెజార్టీని బ్రేక్ చేసే అవకాశం ఉందా.. కామెంట్ చేయండి
Similar News
News November 23, 2025
కూటమి పార్టీలకు సమాన గుర్తింపు: ఎంపీ

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని కర్నూలు ఎంపీ నాగరాజు పిలుపునిచ్చారు. పంచలింగాలలో జనసేన పార్టీ నిర్వహించిన కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనను ముగించేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి టీడీపీ-జనసేన-బీజేపీలను కూటమిగా ఏకం చేశారని అన్నారు. కూటమిలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలకు సమాన గుర్తింపు ఉంటుందన్నారు.
News November 23, 2025
5వ బాలోత్సవం లోగో, బ్రోచర్ ఆవిష్కరణ: కలెక్టర్

మాంటిస్సోరి ఇండస్ పాఠశాలలో డిసెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న 5వ బాలోత్సవం-2025 సన్నాహకాలు వేగంగా జరుగుతున్నాయి. బాలోత్సవానికి ప్రతీకగా రూపొందించిన అధికారిక లోగోను కలెక్టర్ డా.సిరి ఆవిష్కరించారు. బాలోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలను వెలికితీయడానికి ముఖ్య వేదికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే పోటీలు, విభాగాలు, తేదీలు, నిబంధనలు, నమోదు చేయాలన్నారు.
News November 23, 2025
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలుకు పతకాలు

ఈ నెల 15, 16వ తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కర్నూలు క్రీడాకారులు 2 బంగారు, ఒక రజితం, 10 కాంస్య పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఆదివారం కర్నూలు శరీన్ నగర్లోని వెంకటేష్ తైక్వాండో అకాడమీలో పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసులు అభినందించారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.


