News April 9, 2025

ఆశావహ జిల్లాగా పార్వతీపురం మన్యం: కలెక్టర్

image

ఆశావహ జిల్లాగా పార్వతీపురం ఎంపిక అయినట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్య ప్రమాణాలు మరింత మెరుగ్గా ఉండాలని సూచించారు. కుటుంబంలోని పిల్లల మాదిరిగా వసతి గృహ విద్యార్థులను ఆదరించాలని హితవు పలికారు. వసతి గృహాల్లో విద్యార్థులు చేరిన నాటి నుంచి ఆ విద్యార్థికి ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

Similar News

News November 24, 2025

ఆధార్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

జనన ధృవీకరణపత్రాలు లేని వారిని గుర్తించి వారికి ఆధార్ కార్డులు జారీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా సూచించారు. కలెక్టరేట్ వీసీ హాలులో రెవెన్యూ రీ సర్వే , గృహనిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, ఉపాధి హామీ పథకం అంశాల కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో మ్యూటేషన్లు దరఖాస్తులపై రెవెన్యూ డివిజన్ అధికారులు పత్యేక శ్రద్ధ తీసుకొని పరిశీలించాలన్నారు.

News November 24, 2025

అమరావతి: 10 లక్షల సురక్షిత పనిగంటలు పూర్తి

image

అమరావతిలో నిర్మిస్తున్న హౌసింగ్ & బిల్డింగ్ ప్రాజెక్టులలో భాగంగా NGO టవర్స్ 9 & 12 నిర్మాణ పనులను L&T కన్‌స్ట్రక్షన్ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో ఈ నెల 18 వరకు 10 లక్షల సురక్షితమైన పనిగంటలను లాస్ట్ టైమ్ ఇంజరీ లేకుండా విజయవంతంగా పూర్తిచేసిందని అధికారులు చెప్పారు. ఈ ప్రాజెక్టులో సాధించిన మైలురాయి నిర్మాణ రంగంలో CRDA పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనమన్నారు.

News November 24, 2025

NRPT: ప్రేమ విఫలం.. యువకుడు SUICIDE

image

ప్రేమించిన అమ్మాయి దక్కట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాగనూరు (M) కొత్తపల్లిలో జరిగింది. SI అశోక్ బాబు వివరాలు.. కొత్తపల్లికి చెందిన శంకర్(19), బంధువుల అమ్మాయిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తుండటంతో తనకు అమ్మాయి దక్కదని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని అన్న మహేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.