News December 16, 2024
‘ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 ఇవ్వాలి’

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా కార్యకర్తల బస్సు యాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలన్నారు.
Similar News
News December 6, 2025
ADB: ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంసీసీ కొనసాగుతుంది: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున, చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, ప్రకటనలు, అభివృద్ధి హామీలు వంటి చర్యలను తక్షణమే నిరోధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్నికైన సభ్యులకు ఈ విషయం తెలియజేయాలని సూచించారు.
News December 4, 2025
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News December 4, 2025
ADB: అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.


