News December 16, 2024

‘ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 ఇవ్వాలి’

image

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా కార్యకర్తల బస్సు యాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలన్నారు.

Similar News

News January 20, 2025

ఇంద్రవెల్లి: ప్రకృతి ప్రేమికులు ఆదివాసులు

image

ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

News January 20, 2025

ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్‌కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.

News January 20, 2025

నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో కుమ్రం మల్కు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గుడిహత్నూర్ సూర్యపేట గ్రామంలో నుంచి జంగుబాయి దైవదర్శనానికి వెళ్తున్న గ్రామస్థుల ఐచర్ వ్యాన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మల్కు మృతిచెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.