News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News December 1, 2025

అమరావతిలో ‘క్వాంటం’ విప్లవం.. 50వేల మందికి శిక్షణ

image

అమరావతిని గ్లోబల్ క్వాంటం హబ్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం మిషన్’ను ప్రారంభించింది. WISER, Qubitech సహకారంతో 50 వేల మంది విద్యార్థులు, నిపుణులకు క్వాంటం టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనున్నారు. డిసెంబర్ 8న ప్రారంభం. ఫేజ్-1: ఫౌండేషన్ కోర్సు ఫీజు రూ.500. ఫేజ్-2: ఇందులో ప్రతిభ చూపిన టాప్ 3 వేల మందికి అడ్వాన్డ్స్ శిక్షణ పూర్తిగా ఉచితం. దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

News December 1, 2025

KMM: గుర్తుల కేటాయింపులో అభ్యర్థులకు టెన్షన్!

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

News December 1, 2025

వేములవాడ: పార్వతీపురం- ఆలయంవైపు వాహనాలకు NO ENTRY

image

వేములవాడ పట్టణంలోని పార్వతీపురం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాల ప్రవేశాన్ని నిలిపివేశారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నటరాజ విగ్రహం పరిసరాల్లో భక్తుల సంచారం ఎక్కువ అవుతోంది. పార్వతీపురం నుంచి వచ్చే భక్తుల వాహనాలతో మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఈ ప్రాంతం నుంచి భీమేశ్వరాలయంవైపు వాహనాలు రాకుండా అన్నదాన సత్రం వద్ద ప్రత్యేకంగా గేటు ఏర్పాటు చేశారు.