News February 8, 2025
ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు.
Similar News
News December 5, 2025
చిలకలూరిపేట ఘటనపై అధికారులను ఆరా తీసిన మంత్రి లోకేశ్

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందడంపై మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని లోకేశ్ పేర్కొన్నారు.
News December 5, 2025
WGL: కబ్జారాయుళ్లపై నిఘా.. 150 మంది పేర్లతో జాబితా!

ట్రై సిటీలో కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల జాబితాను WGL పోలీసులు తయారు చేసినట్లు తెలిసింది. 360 మంది పేర్లతో కూడిన జాబితాను నిశితంగా పరిశీలించి, వాటి నుంచి 150 పేర్లతో కూడిన ఫైనల్ జాబితాను తయారు చేసి, వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాన నేతలకు సంబంధించిన కొందరు అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ జాబితాను రూపొందించారట.
News December 5, 2025
ఈ వ్యాధితో జాగ్రత్త: సత్యసాయి జిల్లా కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్న సందర్భంగా ప్రజలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ వ్యాధి చిగర్ మైట్స్ అనే సూక్ష్మ పురుగుల కాటుతో వ్యాపిస్తుందని, ప్రారంభ దశలోనే వైద్య చికిత్స పొందితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రారంభదశలో గుర్తిస్తే సులభంగా నయం చేసుకోవచ్చన్నారు.


