News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News November 16, 2025

కర్నూలు: 675 మందిపై కేసులు

image

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.

News November 16, 2025

సంగారెడ్డి: నేడు ఉమ్మడి జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు

image

స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా రైఫిల్ షూటింగ్ బాలబాలికల అండర్-14, 17 సంగారెడ్డి లోని శాంతి నగర్ సెయింట్ ఆంథోనీ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఓపెన్ ఫైట్, పిప్ ఫైట్, పిస్తోల్ ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఒరిజినల్ బోనాఫైడ్, ఆధార్ కార్డుతో ఉదయం 9:30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

News November 16, 2025

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.