News February 8, 2025

ఆశ్రమ పాటశాలల్లో పర్యటించిన అడిషనల్ కలెక్టర్

image

జైనూర్ మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికల పట్నాపూర్‌లో ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలను సందర్శించిన అసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి.. పాఠశాలలో అన్ని రికార్డులను పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు సాదించేందుకు ఒక్క క్రమ పద్ధతిలో ప్రతీ ఒక్క సబ్జెక్టు తగు సమయం కేటాయించాలని సూచనలు చేశారు. 

Similar News

News December 10, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు

image

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో నస్రుల్లాబాద్, మేనూర్, డోంగ్లీ గ్రామాలలో అత్యల్పంగా 7.8°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. బీర్కూరులో 7.9°C, బొమ్మన్ దేవిపల్లిలో 8.2°C, పెద్దకొడప్గల్‌లో 8.4°C, బిచ్కుందలో 8.7°C నమోదయ్యాయి. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలో చలి ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

News December 10, 2025

ఆదిలాబాద్: తెర వెనుక రాజకీయం షురూ

image

ఉమ్మడి జిల్లాలో గురువారం జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. బహిరంగ ప్రచార పర్వం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెర వెనుక రాజకీయాలకు పదును పెట్టారు. ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు రచిస్తూ, గ్రామాల్లోని కీలక కుల సంఘాల పెద్దలను, ముఖ్య నాయకులను కలుస్తున్నారు. తమకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరుతూ, మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.

News December 10, 2025

మన్యం: బాబోయ్ వణుకు..!

image

పాచిపెంటలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సాయంత్రం 4 దాటిన తరువాత చలి తీవ్రత పెరిగి చలి మంటలు వేసుకుంటూ రక్షణ పొందుతున్నారు. ఉదయం పూట మంచు అధికంగా పడటంతో 7 గంటలు దాటితే గానీ ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది? కామెంట్