News December 2, 2024

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి

image

రాష్ట్రంలోనే మొదటి <<14768413>>DSC ఫ్రీ కోచింగ్ సెంటర్‌<<>>ను పార్వతీపురంలో మొదలు పెట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీతంపేట ఐటీడీఏలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 236 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ST-144 SC-44,BC-42, ఐదుగురు ఓసీలు అప్లే చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

image

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

News December 2, 2025

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలి

image

బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రైవేట్ కళాశాలలో చదవ లేక పేదలు విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు.

News December 2, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.