News February 7, 2025

ఆసిఫాబాద్‌ ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

image

ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Similar News

News December 28, 2025

టీ20ల్లో హయ్యెస్ట్ స్కోర్.. ఉమెన్స్ టీమ్ రికార్డ్

image

శ్రీలంక ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న 4వ టీ20లో టీమ్ ఇండియా 221 రన్స్‌ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ T20 మ్యాచుల్లో మనకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారత్ 2024లో వెస్టిండీస్‌పై 217/4, ఈ ఏడాది నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌పై 210/5 రన్స్ చేసింది. అటు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన-షెఫాలీ వర్మ కలిసి హయ్యెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్‌నర్‌షిప్(162 రన్స్) నమోదు చేశారు.

News December 28, 2025

ప్రకాశం జిల్లాకు వచ్చిన హీరోయిన్ శ్రీలీల

image

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

News December 28, 2025

కడియం: ఒకే వేదికపై ఇరు రాష్ట్రాల సీఐలు

image

వృత్తిరీత్యా ఎక్కడ ఉన్నా.. ఆపదలో ఉన్న సహచరులకు అండగా నిలుస్తూ 2009 బ్యాచ్‌కు చెందిన సీఐలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడియంలోని జీఎన్‌ఆర్ కల్యాణ వేదికపై ఆదివారం రెండు రాష్ట్రాల నుంచి సుమారు 400 మంది అధికారులు ఆత్మీయంగా కలుసుకున్నారు. 2022 నుంచి ఏటా కలుస్తున్న వీరు, ఇప్పటివరకు మరణించిన 15 మంది సహచరుల కుటుంబాలకు రూ.8.20 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని అందించి తమ ఉదారతను చాటుకున్నారు.