News March 10, 2025
ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
వరంగల్ ఉమ్మడి జిల్లా లిక్కర్ టార్గెట్ రూ.320.7 కోట్లు

ఉమ్మడి WGL జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో ప్రభుత్వం తొలిసారి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 23వ వరకు పొడిగించింది. 2023-25 టెండర్లలో 16,089 దరఖాస్తులతో రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025-27కు శనివారం వరకు 9,754 దరఖాస్తులకు రూ.292.4 కోట్ల ఆదాయం లభించింది. గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు తగ్గాయి. రూ.320.7 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
News October 20, 2025
పార్వతీపురంలో నేడు జరగాల్సిన పీజీఆర్ఎస్ రద్దు: ఎస్పీ

పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నేడు జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. దీపావళి పర్వదినం సందర్భంగా తాత్కాలింగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే వారం నుంచి యథావిధిగా వినతులు స్వీకరిస్తామన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి వేడుకలు జరుపుకోవాలని జిల్లా ప్రజలకు సూచించారు.
News October 20, 2025
చిత్తూరులో PGRS రద్దు

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.