News March 10, 2025
ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లాకు రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2025
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను వెంటనే పరిష్కరించాలని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 58 మంది ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పంపి, సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News November 17, 2025
అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) అర్జీలను వెంటనే పరిష్కరించాలని కాకినాడ ఎస్పీ బిందుమాధవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన 58 మంది ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు వెంటనే పంపి, సకాలంలో పరిష్కారం చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
News November 17, 2025
మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడొద్దు: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం నాణ్యతలో రాజీ పడకుండా సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్టీరింగ్ కమ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుపై కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. పథకం అమలులో లోటుపాట్లపై ఆరా తీశారు.


