News February 28, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 74.08% పోలింగ్ శాతం నమోదు

మెదక్-నిజామాబాద్-కరీంనగర్- అదిలాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టుభద్రులు 6,137 ఓట్లకు గానూ 4,546 పోలవ్వగా 74.8% పోలింగ్ నమోదైందని చెప్పారు. వీరిలో పురుషులు 3,278,మహిళలు 1,268 మంది ఓటు వినియోగించుకున్నారు. 1,591 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. కాగా ఏప్రిల్ 3న కౌంటింగ్ జరుగనుంది.
Similar News
News November 28, 2025
బాపట్ల DWCWEOలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్మెంట్ ఆఫీస్ (DWCWEO)లో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bapatla.ap.gov.in/
News November 28, 2025
కులాలు, మతాల మధ్య రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించబోం: ఖమ్మం సీపీ

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ ఆదేశించారు. కులాలు, మతాల మధ్య ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు ఉపేక్షించడం జరగదని హెచ్చరించారు. ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
News November 28, 2025
గద్వాల: ఎన్నికల్లో డబ్బు, మద్యంపై నిఘా: ఎస్పీ

గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరుమాల పంచాయతీలోని నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా, పెట్రోలింగ్ను పెంచామన్నారు. ఎవరైనా అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


