News February 28, 2025

ఆసిఫాబాద్ జిల్లాలో 74.08% పోలింగ్ శాతం నమోదు

image

మెదక్-నిజామాబాద్-కరీంనగర్- అదిలాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 17 పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టుభద్రులు 6,137 ఓట్లకు గానూ 4,546 పోలవ్వగా 74.8% పోలింగ్ నమోదైందని చెప్పారు. వీరిలో పురుషులు 3,278,మహిళలు 1,268 మంది ఓటు వినియోగించుకున్నారు. 1,591 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. కాగా ఏప్రిల్ 3న కౌంటింగ్ జరుగనుంది.

Similar News

News December 8, 2025

నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

image

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.

News December 8, 2025

బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

image

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్‌లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.

News December 8, 2025

సిద్దిపేట: ఈ ప్రాంతాల్లో సెక్షన్163 అమలు: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు (మొదటి దశ) ప్రశాంతంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు సెక్షన్ 163 BNSS, 2023 అమలులో ఉంటుందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 12 ఉదయం 7 గంటల వరకు దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మార్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్‌లో అమలులో ఉంటుందన్నారు.