News February 9, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో TOP NEWS

* పదవ తరగతి విద్యార్థిని సూసైడ్ *మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేటీఆర్కు వినతి * జాతరకు ముస్తాబవుతున్న ఆలయాలు* సిర్పూర్ను మహారాష్ట్రలో కలపమన్నారు: కేటీఆర్ * సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలి: జైనూరు సీఐ* కెరమెరిలో నైట్ పెట్రోలింగ్ చేసిన ఎఫ్ఆర్ఓ
Similar News
News March 25, 2025
BIG NEWS: ఏప్రిల్ 1 నుంచి ‘సదరమ్’ స్లాట్లు

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
News March 25, 2025
భద్రాద్రి కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తండా వాసులు

దాసు తండా, రేగుల తండాలలో గత రెండేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని తండావాసులు మంగళవారం అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలో బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు బోడు వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని రెండేళ్ల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని వాపోయారు.
News March 25, 2025
రూ. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మరిచిన BJP: యూత్ కాంగ్రెస్

బీజేపీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరచిపోయిందంటూ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో సంగారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మున్నూరు రోహిత్ మంగళవారం పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు యూత్ కాంగ్రెస్ ధర్నాలు చేస్తామని తెలిపారు.