News January 30, 2025
ఆసిఫాబాద్ జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం విద్యుత్ శాఖ నోడల్ అధికారి వి.వాసుదేవ్ జిల్లాలోని DEE, ADE, AEలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవికాలానికి సంబంధించి విద్యుత్ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఇందులో పురోగతిలో ఉన్న, చేపట్టాల్సిన పనులపై సమీక్షించి మార్గనిర్దేశం చేశారు.
Similar News
News February 9, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
* బీజేపీకి 48, ఆప్నకు 22, కాంగ్రెస్కు 0 సీట్లు
* ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
* AP: 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా: సీఎం చంద్రబాబు
* విడదల రజినీని దోషిగా నిలబెడతా: ప్రత్తిపాటి
* TG: కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: మంత్రి కొండా సురేఖ
* రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నాశనం: కేటీఆర్
News February 9, 2025
నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్గా వ్యవహరించనున్నారు.
News February 9, 2025
ఆటోకు మూడు చక్రాలే ఎందుకు ఉంటాయంటే?

ఆటో రిక్షాలు ఎన్ని అప్డేట్స్ పొందినా మూడు చక్రాలతోనే వస్తున్నాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోర్ వీల్ వాహనాల కన్నా 3 చక్రాల వాహనాలను బ్యాలెన్స్ చేయడం ఈజీ. ఇరుకు ప్రదేశాల్లో దీనిని నడపటానికి అనువుగా ఉంటుంది. దీనిని తయారు చేసేందుకు కూడా తక్కువ ఖర్చు అవుతుంది. ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. ఆటోను నడిపేవారు ఆయిల్పై ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇది ఇంకా మూడు చక్రాలతో వస్తోంది.