News July 12, 2024

ఆసిఫాబాద్: ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక టీమ్‌లు: ఎస్పీ

image

జిల్లాలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరకు జిల్లాలో 10మంది పోలీస్ సిబ్బంది చొప్పున 2టీంలను ఏర్పాటు చేసినట్లు జిల్లా SP,DV.శ్రీనివాస్ రావు తెలిపారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ప్రత్యేక టీంల ద్వారా ప్రతిరోజు వాహనాల తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 9, 2025

ఆదిలాబాద్: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు

image

అన్ని విషయాలు బోధించే ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని, ప్రతి రోజు వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆయా భాష ఉపాధ్యాయులకు ఐఎఫ్‌పిలు ఉపయోగించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు చేశారు.

News February 8, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటా సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News February 8, 2025

ఇచ్చోడ: రాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. MH చంద్రపూర్‌కు చెందిన గాయక్వాడ్ అంకుస్, భార్య జ్యోతితో జున్ని గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో NH-44 క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జ్యోతి స్పాట్‌లోనే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ తరలించారు.

error: Content is protected !!