News January 23, 2025

ఆసిఫాబాద్ : దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం

image

దివ్యాంగులు ఆర్థిక స్వావలంబనతో జీవనం గడిపేందుకు ఉపాధి పునరావాస పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ బుధరవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలు అందిస్తామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 16 యూనిట్లకు రూ.8 లక్షలు రాయితీ మంజూరు చేసినట్లు చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్లో జరుగుతుందని తెలిపారు.

Similar News

News December 3, 2025

ఇండిగోలో సిబ్బంది కొరత.. పలు ఫ్లైట్లు ఆలస్యం, రద్దు

image

సిబ్బంది కొరతతో పలు ఇండిగో విమాన సర్వీసులు లేట్‌గా నడుస్తుండగా, కొన్ని రద్దవుతున్నాయి. మంగళవారం 35% ఫ్లైట్లు మాత్రమే సమయానికి నడిచినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల నుంచి బయలుదేరాల్సిన 200 సర్వీసులు రద్దయ్యాయి. నవంబర్‌లో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇండిగోలో పైలట్లు, ఫ్లైట్ సిబ్బంది కొరత ఎదుర్కొంటోంది.

News December 3, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.

News December 3, 2025

NZB: రూ.17 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

image

NZB పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ పోలీస్ సబ్ డివిజన్‌కు సంబంధించి 170 మంది బాధితులు ఫోన్లు పోగొట్టుకున్నరు. రూ.17 లక్షల విలువైన ఫోన్లను బాధితులకు ACP రాజా వెంకటరెడ్డి అందజేశారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ (https://www.ceir.gov.in)లో నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలన్నారు.