News March 17, 2025
ఆసిఫాబాద్: నేడు, రేపు వడగాలులు

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.
Similar News
News December 7, 2025
శని దోషాలు ఎన్ని రకాలు?

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.
News December 7, 2025
21 లక్షల BCల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్

AP: రాష్ట్రంలో 21 లక్షల BCల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు CS విజయానంద్ తెలిపారు. ‘7.48 లక్షల SC, ST వినియోగదారుల ఇళ్లపైనా 2 కిలోవాట్ల చొప్పున 415 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్టాప్ సోలార్ సెట్లను అమర్చాలి. PM కుసుమ్ కింద 1.36 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ సిస్టమ్స్, PM E-DRIVE కింద వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను మార్చిలోగా ఏర్పాటు చేయాలి’ అని అధికారులకు సూచించారు.
News December 7, 2025
రైతులకు అలర్ట్.. పంటల బీమా చెల్లించారా?

AP: PM ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపులపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. రబీకి సంబంధించి DEC 15లోపు టమాటా, వేరుశనగ, 31లోపు వరి సాగు చేసే రైతులు ప్రీమియం కట్టాలి. మామిడి రైతులకు JAN 3వరకు గడువుంది. భూమిపత్రం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలతో సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, కామన్ సర్వీస్ ఇన్యూరెన్స్ పోర్టల్లో బీమా కట్టొచ్చు. పంట రుణాలున్న రైతులు నేరుగా బ్యాంకుల్లోనే ప్రీమియం చెల్లించొచ్చు.


