News March 17, 2025
ఆసిఫాబాద్: నేడు, రేపు వడగాలులు

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా సోమవారం, మంగళవారం రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.
Similar News
News December 14, 2025
పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.
News December 14, 2025
NZB: అనాథ శవాలకు అంత్యక్రియలు

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించిన అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించాలని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థను కోరారు. దీంతో వారు సంప్రదాయ పద్దతిలో శనివారం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, యూవీ ఫౌండేషన్ మెంబర్ సతీష్, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
News December 14, 2025
రాంపల్లి: సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్.. అన్నీ ఏకగ్రీవమే..!

పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో మూడో విడత ఎన్నికలలో భాగంగా సర్పంచ్గా కనపర్తి సంపత్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఎన్నికను శనివారం రిటర్నింగ్ అధికారులు చేపట్టగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా మడుపు జయలక్ష్మి – శంకర చారిని ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు.


