News March 5, 2025
ఆసిఫాబాద్: పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే బుధవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించడంతోపాటు ఎండల దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Similar News
News November 24, 2025
జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 57 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్హెచ్వోలను ఎస్పీ ఆదేశించారు.
News November 24, 2025
వరంగల్: భారీగా పతనమవుతున్న మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో మొక్కజొన్న ధర రూ.1,970కి పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే, మార్కెట్లో కొత్త తేజ మిర్చికి రూ.14,500 ధర రాగా.. దీపిక మిర్చికి సైతం రూ.14,500 ధర వచ్చింది.


