News February 2, 2025
ఆసిఫాబాద్: పర్యాటక రంగ అభివృద్ధికి కృషి: రామకృష్ణ

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు ప్రాజెక్టు అధికారి రామకృష్ణ తెలిపారు. ఆదివారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ఆధ్వర్యంలో అడ ప్రాజెక్టు వద్ద నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్ను జె.డి.ఎం. నాగభూషణం, ఆసిఫాబాద్ వెలుగు మహిళా మండల సమాఖ్య ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
Similar News
News March 12, 2025
BIG BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

HYDకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) USలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఆయన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. కెరీర్లో 29 టెస్టు మ్యాచ్లు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో HYD రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో AUSపై తొలి టెస్ట్ ఆడారు.
News March 12, 2025
సత్యసాయి: డిప్లమా, డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు

శ్రీ సత్య సాయి జిల్లాలో డిప్లమా లేదా డిగ్రీలో మెగాట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సిస్టం ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాలు వయసుగల యువతీ యువకులు వారికి ఏదైనా రంగంలో మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలన్నారు.
News March 12, 2025
త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.